- మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు
- భార్య లోపల... భర్త బయట నిరసన
రామకృష్ణాపూర్,వెలుగు: క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు ఫండ్స్ కేటాయించడం లేదంటూ ముగ్గురు అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్మీటింగ్బహిష్కరించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయ వనరులు సమాకూర్చుతున్న తమ మూడు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఫండ్స్కేటాయించాలని 7,8,9 వార్డుల కౌన్సిలర్లు పోలం సత్యం, అల్గుల శ్రీలత, పారిపెల్లి తిరుపతి డిమాండ్ చేశారు. తమకు చైర్ పర్సన్ గతంలో మాటిచ్చి నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. అంతకు ముందు ముగ్గురు కౌన్సిలర్లతో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నాగరాజు, ఏఈ అచ్యుత్ సమస్యపై చర్చించినా.. వినలేదు. తక్కువ జనాభా ఉన్న రామకృష్ణాపూర్ ప్రాంతంతో సంబంధం లేకుండా తమ వార్డులకు జనరల్ఫండ్నుంచి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు కావాలని అప్పటి వరకు సమావేశానికి హాజరుకామంటూ భీష్మించుకున్నారు. ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అల్గుల శ్రీలత సమావేశానికి రాకుండానే వెళ్లిపోగా 7,9 వార్డు కౌన్సిలర్లు సత్యం, తిరుపతి మీటింగ్ను బాయ్ కాట్ చేస్తున్నట్లు చెప్పివెళ్లిపోయారు.
మరోవైపు సమావేశం జరుగుతున్న టైంలో మూడో వార్డు కౌన్సిలర్ కొక్కుల స్రవంతి సైతం తమకు మీటింగ్ లపై సమాచారం ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై ఆమె భర్త సత్యనారాయణ సైతం బయట గొడవ చేశారు. మరోవైపు కౌన్సిలర్లు కనీసం వార్డు సమస్యలు చెప్పుకునే పరిస్థితిలేదని, మున్సిపల్ఆఫీసర్లు ఇష్ట్యరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మున్సిపల్ కీలక ఆపీసర్ ఒక్కరూ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తూ తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. సమావేశంలో వైస్ చైర్మన్సాగర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ కీర్తి నాగరాజు, ఏఈ అచ్యుత్, రెవెన్యూ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్వసంత్ తదితరులు పాల్గొన్నారు.