- ఐసీఎంఆర్ఉత్తర్వులు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్(ఆర్సీటీయూ) ఏర్పాటుకు ఐసీఎంఆర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రం నిర్దేశించే క్లినికల్ ట్రయల్స్ గాంధీ మెడికల్ కాలేజీలో కూడా చేస్తారు. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్(ఇంటెంట్)లో భాగంగా అడ్వాన్స్డ్ సెంటర్ఫర్ క్లినికల్ ట్రయల్(ఏసీసీటీ), రీజినల్ క్లినికల్ట్రయల్ యూనిట్(ఆర్సీటీయూ), ఐసీఎంఆర్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్ (ఐసీసీటీ),స్పెషాలిటీ సెంటర్ఫర్ క్లినికల్ ట్రయల్(ఎస్సీసీటీ), నాలెడ్జ్పార్ట్నర్ ఫర్ క్లినికల్ ట్రయల్(కేపీసీటీ) లాంటి 5 విభాగాల్లో దేశవ్యాప్తంగా క్లినికల్ సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సౌతిండియా నుంచి గాంధీ మెడికల్ కాలేజీ ఎంపికైంది.