రాజేంద్ర నగర్ లో జీహెచ్ఎంసీ సిబ్బందిపై కొబ్బరి బొండాల వ్యాపారి దాడి

రాజేంద్ర నగర్ లో జీహెచ్ఎంసీ సిబ్బందిపై కొబ్బరి బొండాల వ్యాపారి దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కొబ్బరి బొండాల వ్యాపారి రెచ్చిపోయాడు. మున్సిపల్ సిబ్బందిపై స్నేహితులతో కలిసి దాడి చేశాడు.  డ్యూటీలో ఉన్న GHMC ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా రాళ్లతో దాడి చేశాడు. రాజేంద్రనగర్  PVNR ఎక్స్ ప్రెస్ ప్లైఓవర్ పిల్లర్ నెంబర్ 202 దగ్గర ఫుట్ పాత్ పై కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు వ్యక్తి. ఐతే పబ్లిక్ కు ఇబ్బంది కలిగేలా ఫుట్ పాట్ కొబ్బరి బొండాల వ్యాపారం చేయవద్దన్నందుకు బల్దియా సిబ్బందిని నోటికొచ్చి బూతులు తిడుతూ దాడి చేశాడు.

 వ్యాపారి దాడిలో ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది సురేశ్, రవికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అధికారులు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిబ్బందిని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పరామర్శించారు.