కూతురు వరసైన బాలికపై అత్యాచారం

కూతురు వరసైన బాలికపై అత్యాచారం

ఆర్మూర్, వెలుగు: కూతురు వరసైన తొమ్మిదేండ్ల బాలికపై ఆర్మూర్ మండలం చేపూర్​ గ్రామానికి చెందిన టీఆర్​ఎస్​ వార్డు మెంబర్ చంద్రశేఖర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయట పడింది. అతనిపై  రేప్​, పోక్సో యాక్ట్​కింద  కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ బాబు సోమవారం తెలిపారు. చేపూర్​ కాలనీ (హరిపురం)లో నివసించే చంద్రశేఖర్​కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు కాగా ఇద్దరూ అతన్ని వదిలిపెట్టేశారు.

భర్తను వదిలేసిన అదే గ్రామానికి చెందిన స్వప్నతో సహజీవనం చేశాడు. స్వప్నకు అదివరకే ఒక కూతురు ఉంది. ఏడాది కింద వారిద్దరూ పెళ్ళి చేసుకుని మామిడిపల్లిలో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం స్వప్న కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లగా.. ఆమె తొమ్మిదేండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను నిజామాబాద్ గవర్నమెంట్​ హాస్పిటల్​లో చేర్చిన చంద్రశేఖర్​అక్కడి  సిబ్బందికి స్వప్న ఫోన్​ నంబర్ ఇచ్చి పరారయ్యాడు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.