మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మరికల్మండలంలోని చిత్తనూర్గ్రామంలో జూరాల ఆగ్రో బయో కంపెనీ వ్యతిరేక పోరాట సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కంపెనీ నిర్మాణం పూర్తయితే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని గ్రామస్తులకు వివరించారు. దీనిని మొదట్లోనే అడ్డుకోవాలన్నారు. కోయిల్సాగర్ప్రాజెక్టు నీటితో పచ్చదనంతో పంటలు మెరుస్తుంటే కంపెనీ వారికి మింగుడు పడడం లేదా అని ప్రశ్నించారు.
కంపెనీ ఏర్పాటైతే గాలి, తాగు, సాగునీరు అన్నీ కలుషితమైపోతాయన్నారు. కంపెనీ మూతపడేవరకు ఐకమత్యంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల న్యాయ పోరాటానికి టీజేఎస్మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 30న హైదరాబాద్లోని సుందరయ్య భవన్లో రౌండ్టేబుల్సమావేశం ఉందని, దీనికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నేతలు రాఘవచారి, చంద్రశేఖర్, వెంకట్రాములు, లక్ష్మయ్య, సుదర్శన్, ఖాదర్, వెంకట్రెడ్డి, యువక మండలి మురళి, మణివర్ధన్ పాల్గొన్నారు.

