హెల్త్ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగులు

హెల్త్ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగులు

హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుండి ఒక శాతం, మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ తో చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చే వారధిగా పని చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.