231 మంది ఖైదీల రిలీజ్​కుసర్కారు నిర్ణయం

231 మంది ఖైదీల రిలీజ్​కుసర్కారు నిర్ణయం
  •  లిస్టు రెడీ చేసిన జైళ్ల శాఖ 

హైదరాబాద్, వెలుగు: వివిధ నేరాలు చేసి రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల రిలీజ్​కు ప్రభుత్వం నిర్ణయించింది. రిపబ్లిక్ డేను పురస్క రించుకుని అర్హులైన ఖైదీల లిస్ట్​ను జైళ్ల శాఖ సిద్ధం చేసింది. గవర్నర్‌‌ తమిళిసై ఈ నెల 24న జీఓ నంబర్‌‌ 2 (హోం డిపార్ట్‌‌మెంట్‌‌) జారీ చేశారు.

ఈ మేరకు 212 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు, 19 మంది ఇతర శిక్షలు అనుభవిస్తున్నవారు కలిపి మొత్తం 231 మంది ఖైదీలను విడుదలకు అర్హులుగా గుర్తించినట్టు సమాచారం. ఈ జాబితాకు కేబినెట్‌‌ ఆమోదం తర్వాత గవర్నర్‌‌ ఆమోద ముద్ర పడితే ఖైదీలను విడుదల చేయనున్నారు.