రోగులకు, వైద్యులకు మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు

రోగులకు, వైద్యులకు మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు

రోగులకు, వైద్యులకు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఆప్యాయంగా మాట్లాడి రోగిలో మానసిక ధైర్యాన్ని నింపాలని సూచించారు.  కమ్యూనిక్ 2021 పేరుతో అపోలో హాస్పిటల్ జరిగిన సెమినార్ కు ఆమె హాజరయ్యారు.   ట్రీట్మెంట్ కి వచ్చే పేషెంట్స్ తో ఎలా మాట్లాడాలి,  వారితో నడుచుకునే విధానం పై స్టూడెంట్స్ కి పలు సూచనలు చేశారు. ఉత్తమ ప్రతిభ చాటిన డాక్టర్స్ ను సత్కరించారు.