
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం (జూన్ 20) లేడీస్ వేదికగా తొలి టెస్ట్ తో ఈ మెగా సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ క్లియర్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. మరోవైపు భారత జట్టు బలహీనంగా కనిపిస్తుంది. సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనుభవం లేని జట్టుగా ఇండియా మారింది. అయితే కుఱ్ఱాలతో సత్తా చాటడానికి భారత సిద్ధంగా ఉంది. యువ కెప్టెన్ శుభమాన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వాలని భారత్ భావిస్తుంది.
ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుకు ఓడించడం కాస్త కష్టమే. సొంతగడ్డపై ఆడుతుండడంతో పాటు ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అదే సమయంలో టీమిండియా యువ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆస్ట్రేలియాలో 2021 లో యువకులే సిరీస్ గెలిపించారు. అదే ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ కు చెక్ పెట్టినా ఆశ్చర్యం లేదు. అయితే భారత జట్టును ఇంగ్లాండ్ మాజీ స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ చాలా తక్కువగా అంచనా వేశాడు. ఇంగ్లాండ్ జట్టుకు ఇండియా ఎలాంటి పోటీ ఇవ్వదని గట్టిగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ప్రివ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే యాషెస్ టెస్ట్లకు భారత సిరీస్ను వార్మప్గా స్పిన్నర్ అభివర్ణించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ కు 4-1 తేడాతో గెలుచుకుంటుందని స్వాన్ జోస్యం చెప్పాడు. ఇండియాతో సిరీస్ పెద్దదని.. వారి దేశంలో మేము మూడు సిరీస్ లు ఓడిపోయామని.. మా సొంతగడ్డపై ఎలాగైనా గెలవాలని స్వాన్ అన్నాడు. స్వాన్ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ ఫైరవుతున్నారు.
టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్
Graeme Swann reckons the India series will act as a ‘perfect warm-up’ for England looking ahead to the Ashes series in Australia.#ENGvIND #England #India pic.twitter.com/gGztGYZ7Ls
— Circle of Cricket (@circleofcricket) June 18, 2025