- ఓదెల స్టేషన్లో రైళ్ల హాల్టింగ్
- ఈ నెల 8 నుంచి ఆగనున్న రామగిరి ప్యాసింజర్, కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
- హాల్టింగ్ పై గత నెల రైల్వే మంత్రి వైష్ణవ్ను కలిసిన వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్/ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో పలు ట్రైన్లకు హాల్టింగ్ ఇస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సౌత్ సెంట్రల్ రైల్వేకు అధికారిక ఉత్తర్వులు అందాయి. 17003/17004 రామగిరి ప్యాసింజర్ (సికింద్రాబాద్–కాగజ్ నగర్), 17035/17036 కాగజ్నగర్సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (ఖాజీపేట నుంచి బల్హార్ష)కు ఓదెల స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. ఈనెల 8 నుంచి అక్కడ ట్రైన్లు ఆగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు. ఓదెల స్టేష్ న్లో రైళ్లు నిలిచేలా కృషి చేయాలని ఓదెల మండలం, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇటీవల వివేక్ని కోరారు. దీంతో ఆయన ఈ స్టేషన్ లో ట్రైన్స్ హాల్టింగ్కు అవకాశం ఇవ్వాలని జనవరి 31న అశ్వినీ వైష్ణవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండల కేంద్రంతో పాటు కీలక స్టేషన్ అని, ఇక్కడి మల్లికార్జున స్వామి టెంపుల్ ఫేమస్ అని, ఏటా సమ్మర్లో తెలంగాణ, ఏపీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని కేంద్ర మంత్రికి వివరించారు. కరోనాకు ముందు ఈ స్టేషన్ లో రైళ్లకు హాల్టింగ్ ఉందని, కరోనా టైమ్ లో వాటిని స్పెషల్ ట్రైన్లుగా మార్చి హాల్టింగ్ తొలగించారని గుర్తు చేశారు. ఇదే విషయంపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు కూడా గతంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి మెమూ పుష్పుల్ రైలు (ఖాజీపేట నుంచి సిర్పూర్)తో పాటు రామగిరి, కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఓదెలలో ఆగేలా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన పెద్దపల్లి, ఓదెల మండల ప్రజలు వివేక్కు కృతజ్ఞతలు తెలిపారు.