హీరో నుంచి మూడు కొత్త బైక్‌ లు

హీరో నుంచి మూడు కొత్త బైక్‌ లు

దేశంలో అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ మూడు ప్రీమియం బైకులను విడుదల చేసింది. ఢిల్లీలో వీటి ఎక్స్‌ షోరూం ధర రూ.94 వేల నుంచి ప్రారంభమవుతోంది. 200 సీసీ ఎక్స్‌పల్స్ 200టీ ధర రూ.94వేలు కాగా, అడ్వెంచర్ బైక్ ఎక్స్‌ పల్స్ 200 ధర రూ.97 వేలుగా,రూ.1.05లక్షలుగా(ఫ్యూయల్ ఇంజెక్షన్‌ తో ) ఉంది. ఇక ఎక్స్‌ ట్రీమ్ 200ఎస్‌‌‌‌ ధర రూ.98,500గా నిర్ణయించింది. మరికొన్ని వారాల్లో వీటి విక్రయాలు ప్రారంభించనున్నట్టు హీరో చెప్పిం ది. ఈమూడు కొత్త బైక్‌ లతో హీరో మోటోకార్ప్‌‌‌‌కు  ప్రస్తుతం ఎక్స్‌ రేంజ్‌ లో నాలుగు మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్‌ లో హీరో లీడింగ్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఉంది.