డ్రోన్లతో ఉగ్రదాడి కుట్ర? : ఢిల్లీలో హై అలర్ట్

డ్రోన్లతో ఉగ్రదాడి కుట్ర? : ఢిల్లీలో హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. డ్రోన్లతో దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ముందే దాడి జరగవచ్చని పోలీసులను అలర్ట్ చేశాయి. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఇటీవల కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్లు ఎక్కువగా కన్పించాయి. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం దగ్గర డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దీంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది.