శివబాలకృష్ణ భారీ స్కాం.. రూ. 250 కోట్లు, 214 ఎకరాలు..

శివబాలకృష్ణ భారీ స్కాం.. రూ. 250 కోట్లు, 214 ఎకరాలు..

హెచ్ఏండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.  ఏసీబీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణ వద్ద రూ.250 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ  ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. 

ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్ సుధీంద్ర మాట్లాడుతూ 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఒక విల్లా గుర్తించామని అధికారులు తెలిపారు. అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. హెచ్ఎండీఏలో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. లాకర్స్‌లోనూ భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని అన్నారు. కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.