సుస్తీచేసినా ఇంట్లనే ఉంటున్నరు..కరోనా భయంతో తగ్గిన ఓపీ

సుస్తీచేసినా ఇంట్లనే ఉంటున్నరు..కరోనా భయంతో తగ్గిన ఓపీ

సీజనల్ డిసీజెస్ వచ్చినా హోం మెడికేషన్
ఎమర్జెన్సీ అయితేనే దవాఖానకు
హైదరాబాద్, వెలుగు : వానాకాలం వచ్చిందంటే సిటీలోని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటళ్ల‌న్నీ కిక్కిరిసేవి. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలతో పాటు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ డిసీజెస్ తో అవుట్ పేషెంట్ బ్లాకులు నిండిపోయేవి. ఇప్పుడు కూడా జనం వాటి బారిన పడుతున్నారు. అయినా, ఆస్పత్రి మెట్లు మాత్రం ఎక్కడం లేదు. కారణం,
కరో నా భయం. ఎమర్జెన్సీ అయితేనే వెళ్తున్నారు. లేదంటే, హోమ్ మెడికేషన్ తీసుకుంటున్నారు. దాంతో ఓపీ సంఖ్య సగానికిపైగా తగ్గింది.

ఎమర్జెన్సీ అయితేనే…

సీజనల్ వ్యాధులొస్తే ఫీవర్ హాస్పిటల్, ఉస్మానియా, నిలోఫర్, ఏరియా హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ల‌కి పేషెంట్స్ ఎక్కువగా వెళుతుంటారు. కరోనాతో దాదాపు పెద్దాస్పత్రులన్నీ కొవిడ్‌ హాస్పిటల్స్ గా మారాయి. చాలా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు
ఏర్పాటు చేశారు. మరోవైపు రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో సీజనల్ డిసీజెస్ బారిన పడ్డ సిటిజన్స్ హాస్పిటల్ కి వెళ్లేందుకు ఇంట్రస్ట్ ‌చూపించడం లేదు. ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తూ మెడిసిన్ తీసుకుంటున్నారు. డాక్టర్లు కూడా ఎమర్జెన్సీ అయితే తప్ప హాస్పిటల్ కి రావద్దని చెప్తున్నారు.

తగ్గిన ఓపీ..

గతేడాది సిటీలో డెంగ్యూ 2,368, చికెన్ గున్యా 644, మలేరియా 305 కేసులు నమోదయ్యాయి. ఒక్కో హాస్పిటల్లో 800 నుంచి వెయ్యికిపైగా ఓపీ ఉంది. ఇప్పుడు కేసులు తక్కువగా నమోదువుతున్నా వ్యాధుల బారిన పడుతున్నవారు ఎక్కువగానే
ఉన్నారు. ప్రస్తుతం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి 700లోపే వస్తున్నారని ఆర్ఎంఓ డా.పద్మజ తెలిపారు. వారిలో కరోనా సింప్టమ్స్ఉన్నవాళ్లు100 మందికిపైగా ఉంటున్నారని తెలిపారు. హాస్పిటల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో
ఇతర పేషెంట్స్ రావడం లేదని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ అయితే తప్ప‌ కేసులు టేకప్ చేయడం లేదు.

ఇంట్లోనే ఉంటూ..

ప్రైవేట్ హాస్పిటల్స్ ఆన్‌‌లైన్‌‌కన్సెల్టెన్సీతో అందుబాటులో ఉండడంతో సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేందుకు సిటిజన్స్ డాక్ట‌ర్ల‌తో కమ్యూనికేట్ ‌అవుతున్నారు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి వంటింటి చిట్కాలు, కషాయాలు వంటివి ఫాలో అవుతున్నారు.
జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు ఉంటే మెడికల్ షాపుకు వెళ్లి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటున్నారు.

అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ లేవు..

వానాకాలం వ్యాధులను దృష్టిలో ఉంచుకుని జిల్లా వైద్యాధికారులు ముందుస్తుగా అవేర్‌‌నెస్ ‌ప్రోగ్రాం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే ప్లాన్‌‌ రెడీ చేశారు. కానీ, కరోనా డ్యూటీలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ సిటీలో ఎక్కడా అవేర్‌‌నెస్‌‌ ప్రోగ్రామ్స్ నిర్వహించలేదు.

సింప్టమ్స్ ఒకేలా..

సీజనల్ డిసీజెస్, కరోనా సింప్టమ్స్ దాదాపు ఒకేలా ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు. వానాకాలంలో వచ్చే అనేక వ్యాధుల్లో జలుబు, దగ్గు , ఫ్లూ జ్వరం సాధారణమైనవి. పలు రకాల వైర‌‌స్‌‌ల వల్ల ఈ వ్యాధులు వ‌‌స్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా అని భయపడకుండా హాస్పిటల్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ముక్కు, నోటికి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్క్‌‌ను ధరించాలంటున్నారు.

కరోనా భయంతో రాట్లేదు..

ఫీవర్ హాస్పిటల్‌‌ వానాకాలం కిటకిటలాడుతుంది. ఇప్పుడు మాత్రం కరోనా భయంతో ఓపీ బాగా తగ్గింది. పేషెంట్లలో
దగ్గు , జలుబు, జ్వరం, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఉంటున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లురాట్లేదు. యంగ్ ఏజ్ లో ఉన్న
ఆడవాళ్లు, మగవాళ్లు వస్తున్నారు. ‑ డా.పద్మజ,ఆర్ఎంఓ, ఫీవర్ హాస్పిటల్

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి