ఇంటర్ బోర్డు సెక్రటరీకి HRC నోటీసులు

ఇంటర్ బోర్డు సెక్రటరీకి HRC నోటీసులు

హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 20 రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలు శ్రీ చైతన్య, నారాయణ కళాశాల ఆగడాల పైన టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సంతోష్ నెల రోజుల క్రితం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సంతోష్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన హక్కుల కమిషన్ స్పందిచి గత వారం శ్రీ చైతన్య.. నారాయణ కాలేజీలకు నోటీసులు జారీ  చేసింది. ఇంతటితో ఆగకుండా ఇవాళ మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని కూడా హాజరు కమ్మని ఆదేశించింది.