హుజూరాబాద్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు

హుజూరాబాద్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు  చేశారు. ఈ పథకాన్ని మొదటగా  పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి అమలు చేయాలని నిర్ణయించి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. గతంలో ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పుడు, సీఎం అయ్యాక అనేక కార్యక్రమాలు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించానని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ... ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ప్రాంరంభోత్సవ తేదీని త్వరలో సిఎం కేసీఆర్ ప్రకటిస్తారని సీఎంఓ తెలిపింది.