కార్లు చోరి చేసి అమ్ముతున్న ముఠా

కార్లు చోరి చేసి అమ్ముతున్న ముఠా

కార్ల దొంగలను పట్టుకున్నారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హసీన్ బతుకు దెరువు కోసం 2014లో హైదరాబాద్ వచ్చి.. శంషాబాద్ లో కార్ మెకానిక్ గా పని చేసేవాడు. పనిలో పనిగా కార్లు దొంగిలించటం ప్రారంభించాడు. మూడు కార్లను దొంగిలించి విక్రయించాడని చెప్పారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. దొంగిలించిన కార్లను శేషుకుమార్, మధుసుధన్ కు అమ్మేశాడని చెప్పారు. నిందితుడు హసీన్ పై యూపీలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులు మహమ్మద్ హసీన్, శేషుకుమార్, మధుసూదన్ ను అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని చెప్పారు సీపీ. నిందితుల నుంచి 18 లక్షల విలువ చేసే మూడు కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్లు కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.