హైదరాబాద్​ హాట్​స్పాట్​..కేసులు ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీల్లో సెకండ్

హైదరాబాద్​ హాట్​స్పాట్​..కేసులు ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీల్లో సెకండ్

న్యూఢిల్లీ:ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్​.. దేశంలో కరోనా హాట్​స్పాట్​లు ఇవి. రెండు సిటీల్లో కేసులు లక్ష దాటేస్తే.. ఇంకో రెండు సిటీల్లో లక్షకు దగ్గరవుతున్నాయి. రోజురోజుకూ వేలల్లో కొత్త కేసులు వచ్చాయి. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి కుదుటపడుతోంది. వైరస్​ ఇన్​ఫెక్షన్లు తగ్గుతున్నాయి. కానీ, ఇప్పుడు ఓ మూడు సిటీలు ఆ హాట్​స్పాట్​లను రీప్లేస్​ చేసేందుకు రెడీ అవుతున్నాయి. కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్త హాట్​స్పాట్​లుగా మారబోతున్నాయి. ఆ మూడు సిటీలు హైదరాబాద్​, బెంగళూరు, పుణే. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీలకు సంబంధించి ఈ మూడు సిటీల్లోనే పాజిటివ్​ రేట్​ ఎక్కువ నమోదవుతోంది.

రాష్ట్రంలో ముందు నుంచీ టెస్టులు ఎక్కువగా చేయలేదు. ఏందని అడిగితే ఐసీఎంఆర్​ చెప్పినట్టు చేస్తున్నమని సర్కార్​ చెప్పింది. అయితే, ఈ మధ్య టెస్టుల సంఖ్యను పెంచింది. దీంతో టెస్టులతో పాటే కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నాలుగు వారాల్లో (నెల) కేసుల వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. ప్రతి పది లక్షల మందిలో 3,342 మందికి కరోనా సోకింది. ప్రతి పదిలక్షల మందిలో ముగ్గురు మహమ్మారికి బలవుతున్నారు. కేసుల వృద్ధి రేటులో బెంగళూరు తర్వాత హైదరాబాదే ఉంది. బెంగళూరులో కరోనా కేసుల వృద్ధి రేటు 12.9 శాతం కాగా, మరణాల రేటు 8.9 శాతంగా ఉంది. కేస్​ఫాటాలిటీ రేట్​ 1.9 శాతం ఉంది. పుణేలో 4.5 శాతం మేర కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు 2.4 శాతం, మొత్తం కేస్​ ఫాటాలిటీ రేట్​ 2.6 శాతంగా నమోదవుతోంది. అయితే, ప్రతి పదిలక్షల మందిలో ఇన్​ఫెక్షన్లు మాత్రం 6,383 మందికి ఉంటోంది. 169 మంది చనిపోతున్నారు.

ఆ నాలుగుసిటీలు మెరుగైనయ్
ఇప్పటిదాకా హాట్స్పాట్లు అని చెప్పుకుంటున్న ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్లలో మాత్రం పరిస్థితి చేతుల్లోకి వస్తోంది. కేసుల వృద్ధి రేటు తగ్గుతోంది. కేసుల వృద్ధిరేటు ఢిల్లీలో 3.4 శాతం,చెన్నైలో 3.3 శాతం, ముంబైలో 2.4 శాతం, అహ్మదాబాద్లో 1.1శాతంగా ఉంటోంది. ఆయా సిటీల్లో మరణాల రేటు వరుసగా 2.2 శాతం, 4.1 శాతం, 2.2 శాతం, 0.7 శాతంగా నమోదవుతోంది.

పేరుకే యాంటిజెన్ టెస్టులు..రిపోర్ట్ ఇవ్వరు