రంజీ ట్రోఫీ లీగ్‌‌‌‌లో వరుసగా మూడో విజయం ఖాతాలో వెసుకున్న హైదరాబాద్‌‌‌‌

రంజీ ట్రోఫీ లీగ్‌‌‌‌లో వరుసగా మూడో విజయం ఖాతాలో వెసుకున్న హైదరాబాద్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌ లీగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (103) సెంచరీకి తోడు చందన్‌‌‌‌ సహానీ (54) రాణించడంతో.. సిక్కింతో రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ 198 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది.

381/3 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ను 78.1 ఓవర్లలో 463/4 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. 384 రన్స్‌‌‌‌ ఆధిక్యం సాధించింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సిక్కిం రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 48.3 ఓవర్లలో 186 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. మిలింద్‌‌‌‌, తనయ్‌‌‌‌ చెరో మూడు, సాయిరామ్‌‌‌‌, కార్తికేయ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 9 వికెట్లు తీసిన తనయ్‌‌‌‌ కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది