మళ్లీ విధుల్లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్ షా ఫైజల్​

మళ్లీ విధుల్లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్ షా ఫైజల్​
  • 2019లో రాజీనామా చేసి జమ్మూలో పార్టీ పెట్టిన షా ఫైజల్
  • తిరిగి డ్యూటీ అప్పగించిన కేంద్రం

న్యూఢిల్లీ: కాశ్మీర్​లో ముస్లింలను అణిచివేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్​ అధికారి షా ఫైజల్​ శనివారం తిరిగి విధుల్లోకి చేరారు. ఫైజల్​ను టూరిజం శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్​లోనే ఆయన్ను సర్వీసులోకి తీసుకున్నా.. శనివారం పోస్టింగ్​ ఇచ్చింది. కాశ్మీర్​కు చెందిన ఫైజల్​ ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయ పార్టీ పెట్టారు. అయితే, కేంద్రం ఆయన రిజిగ్నేషన్​ను యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్​లో తన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.