- 2019లో రాజీనామా చేసి జమ్మూలో పార్టీ పెట్టిన షా ఫైజల్
- తిరిగి డ్యూటీ అప్పగించిన కేంద్రం
న్యూఢిల్లీ: కాశ్మీర్లో ముస్లింలను అణిచివేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి షా ఫైజల్ శనివారం తిరిగి విధుల్లోకి చేరారు. ఫైజల్ను టూరిజం శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్లోనే ఆయన్ను సర్వీసులోకి తీసుకున్నా.. శనివారం పోస్టింగ్ ఇచ్చింది. కాశ్మీర్కు చెందిన ఫైజల్ ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయ పార్టీ పెట్టారు. అయితే, కేంద్రం ఆయన రిజిగ్నేషన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.