
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో రెండు కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. ఆదివారం (జూన్ 15) ప్రకటించిన ఈ రూల్స్ లో కంకషన్ ప్రత్యామ్నాయ నియమాలను సవరించడంతో పాటు వన్డే ఫార్మాట్ లో కొత్త బంతులను ఎప్పుడు ఉపయోగించాలో తెలిపింది. కంకషన్ సబ్స్టిట్యూట్ లో గందరగోళాన్ని తొలగించగా.. వన్డే ఫార్మాట్ లో బ్యాట్, బంతికి మధ్య కాంటెస్ట్ రసవత్తరంగా మార్చాలనే లక్ష్యాలను పెట్టుకుంది. ఐసీసీ సవరించిన రెండు రూల్స్ ఇప్పుడు చూద్దాం.
వన్డేల్లో సవరించిన రెండు-బాల్ నియమం:
వన్డేల్లో రెండు న్యూ బాల్స్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తొలి న్యూ బాల్ 25 ఓవర్లకు ముందు రెండో న్యూ బాల్ 25 ఓవరాల్ తర్వాత తీసుకునే రూల్ ఉంది. ఈ రూల్ ను ఐసీసీ సవరించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన రూల్ ప్రకారం రెండు కొత్త బంతులను 34 ఓవర్లలోపే వాడుకోవాలి. 34 నుంచి 50 ఓవర్ల మధ్యలో ఆ రెండు బంతుల్లో ఒకటే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మార్పు బౌలర్లకు అనుకూలంగా మార్చాలని ఐసీసీ భావించింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో రివర్స్ స్వింగ్ రాబట్టడానికి ఈ రూల్ బౌలర్లకు ఉపయోగపడుతుంది.
కన్కషన్ సబ్స్టిట్యూట్ లో సవరించిన మార్పులు:
ఈ రూల్ ప్రకారం టాస్కు ముందు కెప్టెన్లు ఐదుగురు కన్కషన్ సబ్స్టిట్యూట్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో
ఒక బ్యాట్స్మన్
ఒక ఆల్ రౌండర్
ఒక వికెట్ కీపర్
ఒక స్పిన్నర్
ఒక ఫాస్ట్ బౌలర్ ఉండాలి.
ఇప్పటి వరకు జట్లు ముందస్తు ప్రకటన లేకుండానే మ్యాచ్ సమయంలో కన్కషన్ సబ్స్టిట్యూట్ విషయంలో అప్పటికప్పుడు ఎవరిని పంపించాలనే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ముందుగానే ఐదుగురు కన్కషన్ సబ్స్టిట్యూట్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.