TRS పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు

TRS పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు

TRS ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పూర్తిగా రాజకీయ పార్టీ అని ఇప్పటికే  సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. TRS ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ చెప్పేశారని అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప... ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషమన్నారు. జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా చెప్పారన్నారు. 

టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని... ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా ప్రజలు గమనించాలన్నారు షర్మిల. మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండని ప్రజలకు సూచించారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని.. ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని, ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని ఆరోపించారు.