నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గిరిజనులకే టికెట్ ఇవ్వాలి

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గిరిజనులకే టికెట్ ఇవ్వాలి
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గిరిజనులకే టికెట్ ఇవ్వాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. గిరిజనులకు టికెట్ ఇవ్వకపోతే తమ నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. నాగార్జున సాగర్ లో లంబాడా హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. LHPS వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ రామ్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గణేష్ నాయక్ పాల్గొన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సాగు భూములకు పట్టాలివ్వడంతో పాటు… అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులపై వేధింపులు ఆపాలన్నారు LHPS నేతలు.