IND vs AUS Final: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్

IND vs AUS Final: మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్

240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడగలరా! అన్న ప్రశ్నకు సమాధానం మొదలైంది. భారత పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ద్వయం ఆసీస్ ఇన్నింగ్స్ ను కుప్పకూలుస్తున్నారు. ఈ జోడి పోటీపడి వికెట్ల తీస్తున్నారు. 

ప్రమాదకర వార్నర్(7)ను షమీ ఔట్ చేయగా.. మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతానికి ఆసీస్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(10), మార్నస్ లబుచానే(0) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ త్వరగా ఔటైతే ఇండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువ.