వ్యాక్సిన్‌లో మరో మైలురాయి దాటిన భారత్

వ్యాక్సిన్‌లో మరో మైలురాయి దాటిన భారత్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది.  దేశవ్యాప్తంగా అర్హతగల 80శాతం మంది జనాభాకు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోడీ నాయకత్వంలో 'సబ్కా ప్రయాస్' మంత్రంతో, దేశం 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా వేగంగా దూసుకుపోతోందని మాండవియ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ఇవ్వబడిన కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య గురువారం నాటికి 174.59 కోట్లు దాటింది. గురువారం సాయంత్రం 7 గంటల వరకు 33 లక్షలకు పైగా (33,62,813) వ్యాక్సిన్ డోస్‌లను అందించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్ల సంఖ్య కూడా రెండు కోట్లకు చేరింది. ఈ సందర్బంగా కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ...  టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్‌ టీకాలు తీసుకుంటున్నారని తెలిపారు.15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి కొవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రికాషనరీ డోస్‌ సైతం వేసింది. 

ఇవి కూడా చదవండి:

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కల్వకుంట్ల తెలంగాణ