ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు వేలల్లో నుంచి వందలకు పరిమితం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,383 మందికి పరీక్షలు చేయగా.. 495 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా నుంచి కోలుకోలేక ఒకరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 1,543మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 3 కోట్ల 29 లక్షల 38వేల 630కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదు కాగా.. అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు జిల్లాల వారీగా కింది పట్టికలో చూడండి...

 

ఇవి కూడా చదవండి:

8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

పూణెలో బర్డ్‌ఫ్లూ కలకలం