పూణెలో బర్డ్‌ఫ్లూ కలకలం

పూణెలో బర్డ్‌ఫ్లూ కలకలం

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. థానేలో జిల్లాలో మరోసారి బర్డ్‌ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో బర్డ్ ఫ్లూ సోకే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. బర్డ్ ఫ్లూ ముప్పును పరిగణనలోకి తీసుకుని, నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపారు. ఈ వైరస్‌ వ్యాప్తి మరింత చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పశుసంవర్థకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఫారంలోని కోళ్లను చంపివేయాలని ఆదేశించారు.

వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులకు సూచించారు. అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖను ఆదేశించారు. జిల్లాలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాని థానే జెడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్‌ దంగ్డే వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణే ఆధారిత ప్రయోగశాలకు పంపామని తెలిపారు.

ఏవియన్ ఇన్‌ఫ్లూ ఎంజాని సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. ఇది పక్షుల (ముఖ్యంగా బాతులు,పెద్దబాతులు,అడవి నీటి కోడి)కు వ్యాపించే అంటు వ్యాధి. అడవి పక్షులు వైరస్ లక్షణాలను చూపించకుండానే వైరస్‌ను మోసుకెళ్ల గలవని అధికారులు చెబుతున్నారు. వాటి ఈకలు లేదా మలం ద్వారా పౌల్ట్రీలకు వ్యాపింపచేస్తాయని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి: 

ఎంప్లాయ్ కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు