మనోళ్లు మరో 311 మంది వచ్చేశారు.. ఇప్పటివరకు 1400 మంది ఇండియాకి తరలింపు

మనోళ్లు మరో 311 మంది వచ్చేశారు.. ఇప్పటివరకు 1400 మంది ఇండియాకి తరలింపు

న్యూఢిల్లీ: ఇరాన్  నుంచి మరో 311 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. ఇరాన్ లోని మష్ హాద్  నుంచి ప్రత్యేక విమానంలో వారు ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగారు. దీంతో ఇప్పటివరకూ ఇరాన్  నుంచి స్వదేశానికి చేరుకున్న ఇండియన్ల సంఖ్య 1428కి చేరింది. 

ఇరాన్, ఇజ్రాయెల్  మధ్య యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్  సింధూ’ ప్రారంభించింది. మొదటి బ్యాచ్ లో 290, రెండో బ్యాచ్ లో 310 మంది, మూడో బ్యాచ్ లో 400 మందిపైనే భారతీయులను స్వదేశానికి చేర్చామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్  జైస్వాల్  తెలిపారు.