ఇంగ్లండ్‌‌పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌‌‌‌లో భారత్

ఇంగ్లండ్‌‌పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌‌‌‌లో భారత్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారీ విజయంతో టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌కు చేరుకుంది. 294/7 స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా.. 365 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (96), అక్షర్ పటేల్ (43) అద్భుతమైన ఆటతో టీమిండియా 165 రన్స్ ఆధిక్యం సంపాదించింది. అక్షర్‌తోపాటు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే ఔట్ కావడంతో సుందర్ సెంచరీ తృటిలో మిస్ అయ్యింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో డాన్ లారెన్స్ (50) ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌‌మెన్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచారు.