న్యూఢిల్లీ: సిటిజన్షిప్ చట్టం సెగ ఇండియా క్రికెట్ను కూడా తాకింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గువాహతి వేదికగా జనవరి 5న జరిగే తొలి టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ, ఆటగాళ్లకు సెక్యూరిటీ కల్పించే అంశాలను అసోం క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ పరిశీలిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మ్యాచ్ వేదికను మారుస్తామని, కొంత సమయం మాత్రం వేచి చూస్తామని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. మ్యాచ్కు ఇంకా మూడు వారాల సమయం ఉందని అప్పటి వరకు అంతా సర్దుకుంటుందని అసోం క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిక్షిత్ దత్తా తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో గువాహతి వేదికగా అసోం-సర్వీసెస్ రంజీ మ్యాచ్ నాలుగో రోజు ఆట రద్దయింది. ఆటగాళ్లంతా హోటల్స్కే పరిమితమయ్యారు. అలాగే, కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా అసోం-ఒడిశా మ్యాచ్ కూడా రద్దయింది.
ఇండియా-శ్రీలంక టీ20కి సిటిజన్షిప్ చట్టం సెగ!
- ఆట
- December 15, 2019
లేటెస్ట్
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి