శ్రీహరి కోటలో హై అలర్ట్

శ్రీహరి కోటలో హై అలర్ట్

నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరి కోటలో హై అలర్ట్  ప్రకటించారు అధికారులు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అలర్టయ్యాయి.

తాజాగా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేర్ సెంటర్ పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు రెడీ అయ్యారని తెలిసింది. దాంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం భద్రతబలగాలు తీర ప్రాంతాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తీర ప్రాంతంలో పడవలపై నిఘాను కట్టుదిట్టం చేశారు.