ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పగర్ ఆలం పట్టణానికి సమీపంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
దక్షిణా సుమ్రతా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెంగ్కులు ప్రావిన్స్ నుండి పగర్ ఆలం వెళ్తుండగా బస్సు రోడ్డు రెయిలింగ్ ను ఢీ కొట్టడంతో 150 మీటర్ల లోతు లోయలో బస్సు పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక పోలీస్ అధికారి డాలీ గుమరా చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఇంకా కొంత మంది బస్సులో చిక్కుకున్నారని వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.