కొత్త మార్కెట్లే లక్ష్యం: యాక్సెస్ మెడిటెక్

కొత్త మార్కెట్లే లక్ష్యం: యాక్సెస్ మెడిటెక్

హైదరాబాద్: ఇన్సూర్‌‌‌‌టెక్  కంపెనీ యాక్సెస్ మెడిటెక్  విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.  కొత్త మార్కెట్లకు వెళ్తామని, కొత్త సొల్యూషన్స్​ను అందిస్తామని వెల్లడించింది. సంస్థ ఫౌండర్​,  సీఈఓ సయ్యద్ ఐజాజుద్దీన్ మాట్లాడుతూ పెట్టుబడులను భారీగా పెంచుతామని అన్నారు. 

రాబోయే క్వార్టర్​లో ఉద్యోగుల సంఖ్య 40 శాతం వరకు పెంచుతామని చెప్పారు. తమకు ప్రస్తుతం సౌదీ అరేబియా, దుబాయ్,  హైదరాబాద్‌‌‌‌లో శాఖలు ఉన్నాయని, మిడిల్​ఈస్ట్​కంట్రీల్లో సంస్థను విస్తరిస్తామని సయ్యద్​ చెప్పారు.