హైదరాబాద్: ఇన్సూర్టెక్ కంపెనీ యాక్సెస్ మెడిటెక్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్త మార్కెట్లకు వెళ్తామని, కొత్త సొల్యూషన్స్ను అందిస్తామని వెల్లడించింది. సంస్థ ఫౌండర్, సీఈఓ సయ్యద్ ఐజాజుద్దీన్ మాట్లాడుతూ పెట్టుబడులను భారీగా పెంచుతామని అన్నారు.
రాబోయే క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య 40 శాతం వరకు పెంచుతామని చెప్పారు. తమకు ప్రస్తుతం సౌదీ అరేబియా, దుబాయ్, హైదరాబాద్లో శాఖలు ఉన్నాయని, మిడిల్ఈస్ట్కంట్రీల్లో సంస్థను విస్తరిస్తామని సయ్యద్ చెప్పారు.