గురుకులాల్లో ఇంటర్​ అడ్మిషన్స్ షురూ

గురుకులాల్లో ఇంటర్​ అడ్మిషన్స్ షురూ

తెలంగాణ గిరిజ‌‌న సంక్షేమ గురుకుల విద్యాల‌‌యాల సంస్థ (టీటీడ‌‌బ్ల్యూఆర్ఈఐఎస్‌‌) ఆధ్వర్యంలో న‌‌డుస్తున్న పీవీటీజీ (చెంచు, కోలం, తోటి, కొల‌‌వారి) ప్రతిభా క‌‌ళాశాలల్లో 2022-–2023 విద్యాసంవ‌‌త్సరానికి ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ (ఇంగ్లిష్ మీడియం)

అర్హత‌‌: 2022 మార్చిలో ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి ప‌‌రీక్షల‌‌కు హాజ‌‌రైన తెలంగాణ రాష్ట్ర గిరిజ‌‌న బాల‌‌, బాలిక‌‌లు అర్హులు. ఈ పీవీటీజీ ప్రతిభా క‌‌ళాశాల‌‌ల్లో సీటు పొందిన వారికి ఇంట‌‌ర్‌‌తో పాటు జేఈఈ మెయిన్స్/ అడ్వాన్స్​డ్‌‌, నీట్‌‌, క్లాట్‌‌/ సీఎంఏ, ఇత‌‌ర పోటీ ప‌‌రీక్షల‌‌కు ఉచిత శిక్షణ‌‌ ఇవ్వడంతో పాటు వసతి, ఇతర స‌‌దుపాయాలు క‌‌ల్పిస్తారు.

అప్లికేషన్స్​: అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఆన్​లైన్​లో జులై 30 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.