తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న పీవీటీజీ (చెంచు, కోలం, తోటి, కొలవారి) ప్రతిభా కళాశాలల్లో 2022-–2023 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ (ఇంగ్లిష్ మీడియం)
అర్హత: 2022 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర గిరిజన బాల, బాలికలు అర్హులు. ఈ పీవీటీజీ ప్రతిభా కళాశాలల్లో సీటు పొందిన వారికి ఇంటర్తో పాటు జేఈఈ మెయిన్స్/ అడ్వాన్స్డ్, నీట్, క్లాట్/ సీఎంఏ, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తారు.
అప్లికేషన్స్: అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఆన్లైన్లో జులై 30 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.