
దేశ రాజధాని ఢిల్లీ హైటెషన్ వాతావరణం నెలకొంది. బెయిల్ పై వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలు రాజకీయంగా ఎదగనివ్వకుండా బీజేపీ అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపరేషన్ ఝాదూ ప్రారంభించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
#WATCH | Delhi Police make announcements outside the AAP party office. The police say that section 144 has been imposed in the area and there is no permission for protest as AAP leaders and workers march towards the BJP HQ against the arrest of its party leaders. pic.twitter.com/fGGlhJFBgH
— ANI (@ANI) May 19, 2024
ఆప్ లీడర్ల బీజేపీకి సవాల్ గా మారుతున్నారని అందుకే ఆపరేషన్ ఝాదూతో వాళ్లని అరెస్ట్ చేస్తున్నారని, AAP బ్యాంక్ అకౌంట్లు కూడా త్వరలో ఫ్రీజ్ చేస్తారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఆయన ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు.
#WATCH | Aam Aadmi Party (AAP) leaders and workers hold a protest against the BJP, in Delhi
— ANI (@ANI) May 19, 2024
Delhi CM and AAP national convener Arvind Kejriwal is also present. pic.twitter.com/ZRqCWOBBO4
ఆప్ ఎంపీ పైన సొంత పార్టీ నాయకుడి పీఏనే తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. హజారీ కోర్టు ఆయనకు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ అరెస్ట్ కు నిరసనగా ఆప్ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముందు నిరసన చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఆమ్ ఆద్మీ నాయకులతో పాటు ఇండియా కూటమి నాయకులు కూడా వస్తున్నారు.
अबे भाई, इतनी फ़ोर्स ??
— Rahul Tahiliani (@Rahultahiliani9) May 19, 2024
pic.twitter.com/lrNke7vB6N
ఢిల్లీలోని DDU మార్గ్ లో ఉన్న బీజేపీ హెడ్ ఆఫీస్ ముందు నిరసన తెలపడానికి జైల్ భరో మార్చ్ చేస్తున్నారు. మరోవైపు ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించారు. డీడీయూ మార్గ్లోని బీజేపీ కార్యాలయంలో భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు బార్కేట్లు పెట్టి, భారీగా మోహరించారు. ఆప్ నాయకులు ఇప్పుడే ర్యాలీగా రోడ్లపైకి చేరుతున్నారు. వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.