IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న  మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్స్ తడబడి నిలిచారు. దీంతో లక్నో, రాజస్థాన్ కు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

లక్నోలోని ఏకేన క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో జట్టుకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రాజస్థాన్ బౌలర్లు షాకిచ్చారు.  లైన్ అండ్ లెన్త్ బంతులతో  రాజస్థాన్ బౌలర్లు చెలరేగడంతో 11 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది లక్నో. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50)లు అర్థ శతకాలతో చెలరేగి  జట్టును ఆదుకున్నారు.

అయితే, మిగతా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. చివర్లలో అయూష్ బదోని(18 నాటౌట్), కృనాల్ పాండ్య(15 నాటౌట్)లు కూడా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు.  లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.  రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండువికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో వికెట్ తీశారు.