6ఏ గ్రేడ్​ టెంపుల్స్​లో డీఈవో పోస్టుల గందరగోళం

6ఏ గ్రేడ్​ టెంపుల్స్​లో డీఈవో పోస్టుల గందరగోళం
  • కొత్తగా క్రియేట్​ చేసిన సర్కారు
  • యాదాద్రి, వేములవాడకు శాంక్షన్​
  • భద్రాద్రికి అబ్జక్షన్​
  • కొత్త పోస్టులపై ఎంప్లాయీస్    అభ్యంతరాలు

భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలోని 6ఏ గ్రేడ్​ టెంపుల్స్ లో డీఈవో పోస్టుల భర్తీ గందరగోళంగా మారింది. ఇటీవల భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాల్లో డీఈవో(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పోస్టులకు ఎండోమెంట్​డిపార్ట్​మెంట్​ప్రపోజల్స్ కోరింది. మూడు దేవస్థానాల నుంచి ప్రపోజల్స్ వెళ్లగా తెలంగాణ సర్కారు యాదగిరిగుట్ట, వేములవాడకు డీఈవో పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి మాత్రం అభ్యంతరాలు తెలుపుతూ శాంక్షన్​ చేయలేదు. శాంక్షన్​ అయిన రెండు ఆలయాలకు, రిజక్ట్ అయిన భద్రాద్రికి కారణం జీవో నం.888 కావడం గమనార్హం. దీంతో సర్కారు శాంక్షన్​ఇచ్చినా ఎండోమెంట్​కమిషనర్​ఇప్పటివరకు ఆ రెండు ఆలయాలకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పోస్టుల క్రియేషన్ పై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గారు. మరో వైపు సీనియార్టీ గోల తోడు కావడంతో యాదగిరిగుట్టలో ఓ ఎంప్లాయీ కోర్టును ఆశ్రయించాడు. తన లెక్క తేల్చకుండా డీఈవో పోస్టు భర్తీ చేయొద్దంటూ ఆయన డిమాండ్​ చేస్తున్నారు. కోర్టు ఆర్డర్​ కూడా తెచ్చుకున్నారు. 

ఒక్కో గుడిలో రెండేసి పోస్టులు

మూడేండ్లుగా ఏటా రూ. 25 లక్షలకు పైగా ఆదాయం వచ్చిన గుడులకు 6ఏ గ్రేడ్​ ఇస్తారు. జీవో నంబరు 888 ప్రకారమే 6ఏ టెంపుల్స్ లో పోస్టులు ఏఈవో(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​) నుంచి కిందిస్థాయి స్టాఫ్​వరకు నియామకాలు, బదిలీలు జరపాలి. యాదగిరిగుట్ట, వేములవాడలకు రెండేసి డీఈవో పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్​చేసింది. డీఈవో, అసిస్టెంట్​స్థపతిని నియమించుకోవాలని అందులో పేర్కొన్నారు. వారికి జీతభత్యాలన్నీ ఆయా ఆలయాల బడ్జెట్​ నుంచే తీసుకోవాలని సూచించారు. కానీ భద్రాద్రి ఆలయం విషయంలో మాత్రం ఈ జీవో ప్రకారం కుదరదు అంటూ పేర్కొనడం వివాదంగా మారింది. ఈ జీవో మార్చకుండా ఇతర పోస్టులు క్రియేట్​చేయడం కుదరదు. దీంతో ఎండోమెంట్​ కమిషనర్​ యాదగిరిగుట్ట, వేములవాడకు ఈ పోస్టులు శాంక్షన్​ అయినా జీవో రిలీజ్ చేయడం లేదని ఎండోమెంట్​వర్గాలు పేర్కొంటున్నాయి. 

యాదాద్రిలో పేచీ

ఇదిలా ఉంటే యాదాద్రిలో డీఈవో పోస్టు భర్తీ విషయంలో పేచీ నడుస్తోంది. అక్కడ ఐదుగురు ఏఈవోలు ఉన్నారు. ఒకరికే డీఈవో అయ్యే చాన్స్ ఉంది. సీనియర్టీ ప్రకారం తనకే ఆ పోస్టు రావాలంటూ ఓ ఎంప్లాయీ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈయన సస్పెండ్​అయ్యారు. తర్వాత క్లీన్​చిట్​ తెచ్చుకున్నారు. సస్పెన్షన్ కాలం నాటి బెనిఫిట్స్ మొత్తం తీసుకున్నపుడు సీనియార్టీ కూడా వర్తిస్తుంది కదా.. అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీపై తేల్చకుండా భర్తీ చేయడానికి వీల్లేందంటూ ఆయన కోర్టు ద్వారా ఆర్డరు తెచ్చుకున్నారు.

అవసరం ఏముంది?

6ఏ టెంపుల్స్​లో డీఈవో పోస్టు అవసరం  ఇప్పుడు ఏముందంటూ ఆయా దేవస్థానాల ఎంప్లాయీస్​ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టు తమ ప్రమోషన్లకు తీవ్ర ఆటంకమని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఏఈవో పోస్టు వరకు జీవో నంబరు 888 ప్రకారం ఆయా దేవస్థానాలే నెలనెలా జీతభత్యాలు చెల్లిస్తుంటాయి. ఆ త ర్వాత సీనియార్టీ ప్రకారం ఏఈవో నుంచి అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫ్​ఎండోమెంట్స్ కు ప్రమోషన్​పై వెళ్తారు. తర్వాత గవర్నమెంట్ ద్వారా గెజిటెడ్ ​ఆఫీసర్​ హోదా వస్తుంది. గతంలో భద్రాచలంలో పనిచేసిన వి.రామ కృష్ణంరాజు ఇలాగే ఏఈవోగా చేసి తర్వా త అసిస్టెంట్, డిప్యూటీ కమిషనర్​ స్థాయికి వెళ్లారు. తర్వాత సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా వచ్చారు. ఇప్పుడు క్రియేట్​ చేసిన డీఈవో పోస్టు వల్ల ఇక టెంపుల్ ​సర్వీసులోనే రిటైర్​ అవ్వాల్సి వస్తుంది. అసలు ఎంప్లా యీస్​ అభిప్రాయ సేకరణ లేకుండా, 888 జీవో సవరించకుండా డీఈవో పోస్టు ఎలా క్రియేట్​ చేశారని వారు నిలదీస్తు న్నారు. పోస్టు గెజిటెడా.. లేక నాన్​గెజి టెడా.. స్కేల్​పరిస్థితి తేల్చకుండా ఎలా చేశారంటున్నారు. గతంలో టీటీడీలో మాత్రమే ఈ పోస్టు ఉండేదని, అటానమస్​ కాబట్టి అక్కడ ఆ పోస్టు సరిపోతుందని, కానీ ఇక్కడ తమ ప్రమోషన్లకు ఆటంకం కల్పించేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.