జేపీఎస్లకు ఉద్యోగ భద్రత కల్పించాలె.. మోకాళ్ళపై నిరసన

జేపీఎస్లకు ఉద్యోగ భద్రత కల్పించాలె.. మోకాళ్ళపై నిరసన

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే డిమాండ్ చేస్తు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మే 12వ తేదీ శుక్రవారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 15వ రోజు సమ్మె మోకాళ్ళపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు జేపీఎస్ లు. ఈ సందర్భంగా జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్దికి నిరంతరం కృషి చేసి అవార్డులు వచ్చే విధంగా పని చేసిన పంచాయతీ కార్యదర్శుల విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.