మెరిట్ గిరిట్​ జాన్తానై.. రిజల్ట్స్ రాకుండానే నియామకాలు

మెరిట్ గిరిట్​ జాన్తానై.. రిజల్ట్స్ రాకుండానే నియామకాలు

మైనార్టీ కాలేజీల లెక్చరర్ల పోస్టుల నియామకంలో అక్రమాలు

రిజల్ట్స్​ ప్రకటించకుండానే ఉద్యోగ నియామకాలు

అయోమయంలో అభ్యర్థులు

ఇంటర్వ్యూలు ఆపాలని డిమాండ్​

మహబూబ్​నగర్, వెలుగు: మైనార్టీ కాలేజీల్లో జూనియర్ ​లెక్చరర్ల పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల రిజల్ట్స్​ ప్రకటించకుండానే నియామకాలు చేపట్టడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా ఐదు మైనార్టీ జూనియర్ కాలేజీలు 2020–-21 విద్యా సంవత్సరానికి మంజూరయ్యాయి. ఆ కాలేజీల్లో 32 మంది జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు. నోటిఫికేషన్​ విడుదల కావడంతో 459 మంది దరఖాస్తు చేసుకున్నారు. 216 అప్లికేషన్లను జిల్లా విజిలెన్స్​కమిటీ రిజెక్ట్​ చేసింది. 243 మందికి ఈ నెల 6న పరీక్ష పెట్టారు. ఎగ్జామ్​ రిజల్ట్స్​వెల్లడించకుండానే బుధవారం కొంతమందికి నేరుగా ఇంటర్వ్యూలకు రమ్మని ఔట్​సోర్సింగ్​ ఏజెన్సీ నుంచి ఫోన్లు వెళ్లాయి.

ఫలితాలపై అనుమానాలు

రిజల్ట్స్​ ప్రకటించకుండా ఏకంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాలకు స్టేట్​ మైనార్టీ వెల్ఫేర్​అసోసియేషన్​ ఈ ఏడాది కొత్తగా కాలేజీలను కేటాయించింది. జూనియర్​ లెక్చరర్ల నియామకానికి పరీక్షలు నిర్వహించారు. ఆయా జిల్లాల పేపర్లను ఇతర జిల్లాల్లో కరెక్షన్​ చేయించారు. అయితే రిజల్ట్స్​ ప్రకటించకుండా  ఇంటర్వ్యూలు ఆయా జిల్లాల్లో కాకుండా ఇతర ఉమ్మడి జిల్లాల్లో గురువారం నుంచి  నిర్వహిస్తున్నారు. ఇక్కడే అసలు మతలబు జరిగిందని, రాష్ట్రస్థాయిలోనే ఔట్ సోర్సింగ్​ఏజెన్సీలు, అధికారులు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాకేం సంబంధం లేదు

మైనార్టీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించాం. మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాలో అవార్డు అనే ఔట్​సోర్సింగ్​ ఏజెన్సీ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. మాకేం సంబంధం లేదు. అంతా ఏజెన్సీ వాళ్లే చూసుకుంటున్నారు.

‑ శంకరాచారీ, జిల్లా మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీసర్​

లిస్ట్​ ఇచ్చారు.. పిలుస్తున్నం

ఉమ్మడి జిల్లాలో జూనియర్​ లెక్చరర్ల పోస్టుల నియమకాలకు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాం. పేపర్లను ఇతర జిల్లాలోని కాలేజీల్లో దిద్దించారు. రిజల్ట్​మాత్రం స్టేట్​ మైనార్టీ వెల్ఫేర్​ఆఫీసర్లే చూస్తున్నారు. మాకు లిస్ట్​ ఇచ్చారు. వాళ్లను పిలవమని చెప్పడంతో  ఇంటర్వ్యూలకు పిలుస్తున్నం.

‑ వెంకటయ్య, అవార్డు ఔట్​సోర్సింగ్​ ఏజెన్సీ, పాలమూరు

For More News..

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ధర్నా చేస్తున్న కార్యకర్తను కడుపులో తన్నిన ఎస్సై

ఈఫిల్ టవర్‌‌‌‌కు బాంబు బెదిరింపు