తొలిసారి చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయి..కేసీఆర్ మనవడిని కదా అందుకే

తొలిసారి చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయి..కేసీఆర్ మనవడిని కదా అందుకే

హైదరాబాద్  గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చినప్పుడు తన కళ్లల్లో నీళ్లు వ‌చ్చాయ‌ని మంత్రి కేటీఆర్ కొడుకు క‌ల్వకుంట్ల హిమాన్షు అన్నారు. ఈ స్కూల్ కు ఏదైనా చేయాలని అనుకున్నానని..అయితే అంద‌రిలా కాకుండా కొత్తగా  చేయాల‌నుకున్నానని చెప్పారు.  ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మల్‌గా చేస్తే కొత్తేముందన్నారు.  కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాదాపు కోటి రూపాయల నిధులను సేకరించి అధునాతనంగా తీర్చిదిద్దారు హిమాన్షు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి స్కూల్ ను ప్రారంభించారు.

Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.

It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July??

Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0

— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023

2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయిన‌ప్పుడు  కేశవనగర్ ప్రభుత్వ స్కూల్‌ను క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచ‌న‌తో సందర్శించానని హిమాన్షు తెలిపారు. పాఠశాల పరిస్థితిని చూసి చలించిపోయానని.. ఆడ‌పిల్లల‌కు స‌రైన బాత్రూమ్స్ లేవన్నారు.  రాళ్ల మ‌ధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారని... తాను వ‌చ్చిన రోజే ఓ పిల్లాడు మెట్లపై నుంచి జారిప‌డి దెబ్బ త‌గిలించుకున్నాడని చెప్పారు. ఆ ప‌రిస్థితిని చూసిన త‌ర్వాత అన్ని క్లాస్ రూమ్స్ తిరిగామని... ఫ‌ర్నీచ‌ర్‌ను ప‌రిశీలించామన్నారు. హెడ్ మాస్టర్ రూమ్‌లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్‌ను చూసి షాక‌య్యానన్నారు. ఆ తర్వాత రూ 40 ల‌క్షలు ఫండ్ సేకరించామన్నారు.దీనికి సీఎస్ఆర్ ఫండ్ కూడా  సహాయం చేసిందన్నారు. వీటితో స్కూల్లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు.  కేశవనగర్  స్కూల్లో చ‌దివే విద్యార్థులంతా  పేదవారన్నారు హిమాన్షు.  కూలీ ప‌నులు చేసుకునే కుటుంబాల‌కు చెందిన‌వారే చదువుతున్నారని చెప్పారు.  ఈ స్కూల్ పిల్లల్లో ఫ్యూచ‌ర్‌లో ఇంజినీర్లను, డాక్టర్లను, లాయ‌ర్లను చూడాలని ఆకాంక్షించారు.  విద్యార్థుల్లో  పొలిటిషీయ‌న్లను చూడాలన్నారు.