35 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్న కమల్, మణిరత్నం

35 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్న కమల్, మణిరత్నం

35 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్న కమల్ - మణిరత్నం నాయకన్ మూవీ తర్వాత 35ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత స్టార్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో మూవీ రాబోతుంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. అయితే ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండడం చెప్పుకోదగిన విషయం. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్.. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.

అయితే కమల్ హాసన్ చేయబోయే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వహించనున్నారు.  ఇద్దరు సినీ దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయికలో వచ్చిన నాయగన్ అప్పట్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుండడంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.