కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ గా రిపోర్ట్ రావడంతో ఆయన ప్రస్తుతం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరూ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వారందరూ హోంక్వారంటైన్ విధించుకోవాలని సూచించారు. కొన్ని రోజులకు ముందు కర్ణాటక సీఎం యెడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య కరోనా బారినపడి కోలుకున్నారు.

గత 24 గంటల్లో కర్ణాటకలో 5,851 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 2,83,665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా గత 24 గంటల్లో 130 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటివరకు 4,810 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో ప్రస్తుతం 81,230 యాక్టివ్ కేసులుండగా.. 1,97,625 మంది రికవరీ అయ్యారు.

For More News..

శాలరీ కట్ చేస్తానన్నాడని యజమానిని చంపిన ఉద్యోగి

హీరో సుశాంత్ శవపరీక్ష కావాలనే ఆలస్యం చేస్తున్నారు

అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్