ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా.. కరుణ్ నాయర్

ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా.. కరుణ్ నాయర్

జైపూర్: ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా టెస్టు జట్టులోకి తిరిగి రావడంపై సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ సంతోషం వ్యక్తం చేశాడు. గత ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్లో నిల కడైన ఆట చూపెట్టిన తాను ఈ పిలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూశానని చెబుతు న్నాడు. టెస్టు టీమ్ లోకి రీఎంట్రీ ఇవ్వడాన్ని గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ తెలిపాడు. నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ఆడాడు. ఈ ఫార్మా ట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన కొన్ని నెలలకే టీమ్ లో ప్లేస్ కోల్పోయిన అతను ఇన్నేళ్లకు మళ్ళీ జట్టులోకి వచ్చాడు.

 'నిజంగా సంతోషంగా, గర్వంగా ఉంది. గత 12- 16 నెలలుగా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా పద్ధతులను అలాగే కొనసాగించా. నా ఆటతీరు మెరుగు పడటంతోపని చేసిన విషయాలను కొనసా గించాను. ఇన్నాళ్లకు తిరిగి నేషనల్ టీమ్ లోకి వచ్చినందుకు కృతజ్ఞుడను. దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నా. అందరితో పాటు నాకు కూడా నా సెలెక్షన్ గురించి తెలిసింది. ఈ పిలుపు కోసం ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూశాను' అని శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.