సీఎం కేసీఆర్కు కాసాని లెటర్
హైదరాబాద్, వెలుగు: కోకాపేటలో బీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి 11 ఎకరాల స్థలం కేటాయించినట్లుగానే తమకు కూడా కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎక్సలెన్స్ సెంటర్కు గజానికి రూ.7,500 చొప్పున స్థలం కేటాయించారని.. అదే ధరకు టీడీపీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం స్థలం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ కోసం బంజారాహిల్స్లో రోడ్డు నం12లో గజానికి రూ.100 చొప్పున ఎకరం భూమి కేటాయించారని, తమకు కూడా తెలిపారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ కోసం కూడా అదే ధరకు బంజారాహిల్స్లో ఎకరం భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.