119 స్థానాల్లో పోటీ చేస్తం

119 స్థానాల్లో పోటీ చేస్తం
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంద ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్​లో పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ బలోపేతం అవుతున్న దని, ఇతర పార్టీల నుంచి చేరికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి టీడీపీలోకి వలసలు ఊపందుకుంటా యన్నారు. వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించడం ఖాయమని అన్నారు. 

పెద్దపల్లి జిల్లా వైఎస్సార్​ టీపీ యువజన విభాగం అధ్యక్షుడు పలకల చంద్రారెడ్డి, వొదేల మండల యూత్ ప్రెసిడెంట్ కొలిపాక రాజు ముదిరాజ్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్ పాల్గొన్నారు.