లిక్కర్ స్కాంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరిగే ఛాన్స్

లిక్కర్ స్కాంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరిగే ఛాన్స్

ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్ణయించింది కేజ్రీవాల్ సర్కార్. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న టైంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు ఎమ్మెల్యేలు. లిక్కర్ స్కాం, బీజేపీ నేతల ఆరోపణలు, ఆపరేషన్ లోటస్... అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో జరగాల్సిన వారాంతపు భేటీని అసెంబ్లీ సమావేశం కారణంగా రద్దు చేసుకున్నారు కేజ్రీవాల్.

మరోవైపు నిన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన కేజ్రీవాల్.. తర్వాత రాజ్ ఘాట్ ను సందర్శించి.. మహాత్ముడికి నివాళులర్పించారు. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకే ఆమ్ ఆద్మీనేతలు రాజ్ ఘాట్ ను సందర్శించారని... బీజేపీ విమర్శించింది. ఆప్ నేతలు రాజ్  ఘాట్ ను సందర్శించిన తర్వాత మహాత్ముడి స్మార్థకాన్ని బీజేపీ కార్యకర్తలు గంగాజలం చల్లి శుద్ధి చేశారు. కేజ్రీవాల్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.