అల్లా కోసం కొడుకును బలిచ్చిన తల్లి

అల్లా కోసం కొడుకును బలిచ్చిన తల్లి

పాలక్కడ్: దేవుడికి మొక్కుగా సొంత కొడుకునే ఓ తల్లి కిరాతకంగా చంపిన దారుణమైన ఘటన కేరళలోని పాలక్కడ్‌‌లో జరిగింది. 30 ఏళ్ల మహిళ మదర్సా టీచర్ అయిన ఆమె పేరు షహీదా. అల్లాకు మొక్కు చెల్లించాలని ఆమె తన ఆరేళ్ల కొడుకును చంపడం సంచలనం రేపింది. కొడుకును చంపిన విషయాన్ని షహీదానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి షహీదా కొడుకు బాత్రూమ్‌‌లో చనిపోయి ఉన్నాడు. గర్భిణి అయిన షహీదా.. అల్లాను సంతృప్తి పర్చడం కోసం ఈ హత్య చేశానని చెప్పడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనపై మరింత విచారణ జరిపాకే పూర్తి వివరాలు తెలియజేస్తామని పాలక్కడ్ ఎస్పీ ఆర్.విశ్వంత్ అన్నారు. షహీదా మీద సెక్షన్ 302 (మర్డర్) కింద కేసు బుక్ చేశామన్నారు.