మేడ్చల్: పేట్ బషీరాబాద్ రోడ్డు ప్రమాదంలో యువతి మృతికి కారకుడైన కేఎంబీటీ (KMBT) ట్రావెల్స్ బస్సు డ్రైవర్ దాసరి అంకయ్య(35)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నెల 21వ తేదీన దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదంలో అక్క మృతి, తమ్ముడు తీవ్ర గాయాలకు కారణమైన డ్రైవర్ పరారీలో ఉండగా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింధూజ(23) మృతి చెందగా ఆమె తమ్ముడు సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అజాగ్రత్త బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దాసరి అంకయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.