
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2989 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pabhas) హీరోగా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకిక్కిస్తోంది.
ఇండియన్ మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లుక్స్, విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే..ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా 2024 జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో..శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడిపిస్తూనే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డేట్ ఫిక్సైనట్లు ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు హైదరాబాద్లోని ప్రముఖ రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టాక్ మొదలయ్యింది. ఈ భారీ ఈవెంట్ మే 22న గ్రాండ్ గా నిర్వహించనున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా..బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.