
- విక్టరీ సెలబ్రేషన్స్కు గైడ్లైన్స్ తెచ్చే యోచనలో బీసీసీఐ
బెంగళూరు/న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) సెక్రటరీ ఎ శంకర్, ట్రెజరర్ ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం రాత్రే కేఎస్సీఏ ప్రెసిడెండ్ తమ రాజీనామాలను సమర్పించినట్లు శంకర్, జైరామ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ‘గత రెండు రోజులుగా ఊహించని దురదృష్టకర సంఘటనలు జరిగాయి. ఇందులో మా పాత్ర చాలా పరిమితమైనప్పటికీ కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ట్రెజరర్లుగా మా పదవులకు రాజీనామా చేశామని తెలియజేస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద జన సమూహాల నిర్వహణ తమ బాధ్యత కాదని తాము విధానసౌధ వద్ద వేడుకలకు అనుమతి కోరామని కేఎస్సీఏ ప్రెసిడెంట్ రఘురామ్ భట్, శంకర్, జైరామ్ కర్నాటక హైకోర్టుకు తెలిపారు. కాగా, భవిష్యత్తులో క్రికెట్ విజయోత్సవ వేడుకలకు మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. ఇది ఆర్సీబీ ప్రైవేట్ వ్యవహారమైనప్పటికీ, ఇండియాలో క్రికెట్కు బీసీసీఐ బాధ్యత వహిస్తుందని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు. ఇటువంటి అంశాల్లో బీసీసీఐ సైలెంట్గా ఉండదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.